01-04,05,06-గీతా మకరందము.
అర్జునవిషాదయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| దుర్యోధనుడు పాండవపక్షమునగల ముఖ్యయోధుల పేర్లను ద్రోణాచార్యున కెఱింగించుచున్నాడు -
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః ||
ధృష్టకేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ
శైబ్యశ్చ నరపుంగవః ||
యుధామన్యుశ్చ విక్రాన్త
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః ||
తా:- ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులు పెక్కురుకలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కున్తిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు ఉపపాండవులు. వీరందఱును మహారథులే అయి యున్నారు.
వ్యాఖ్య:- పైన దెల్పిన వీరులందఱు భీమార్జునులతో సమానులని చెప్పుటవలన వారిరువురును శూరాగ్రేసరులనియు, దుర్యోధనునకు భయోత్పాతము కలిగించువారనియు స్పష్టపడుచున్నది. దుర్యోధనుడు స్వపక్షవీరులను గూర్చి ముందుగా దెలుపక పరపక్షనాయకులను వర్ణించి చెప్పుటలో రెండు కారణములు కలవు - (1) ఆచార్యునకు శత్రుసైన్యముపై రోషము కల్పించుట (2) తన సైన్యము విషయమై ధైర్యము తగ్గియుండుట, లేక, తన సైన్యముకంటె ప్రతిపక్ష సైన్యమే బలవత్తరముగ నున్నదను భావము గలిగియుండుట.
“మహారథుడు" - పదివేల ధనుర్ధరులగు యోధులతో ఏకాకిగ యుద్ధము చేయగలవాడును, ఆయుధశాస్త్రమందు ప్రవీణుడునగు శూరుడు మహారథు డనబడును*.
యుయుధానుడు - ఇతనికి సాత్యకి యనియు పేరుగలదు.
ధృష్టకేతువు - చేదిదేశపురాజు, శిశుపాలుని పుత్రుడు.
పురుజిత్, కున్తిభోజులు - కుంతీదేవికి సోదరులు.
ద్రౌపదేయులు - ద్రౌపదిసుతులగు ఉపపాండవులు, ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు - వీరైదుగురున్ను క్రమముగ ధర్మరాజ భీమాదులకు ద్రౌపదివలన గలిగిన సంతానము.
-------------------------
*ఏకోదశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినామ్
శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః
అర్జునవిషాదయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| దుర్యోధనుడు పాండవపక్షమునగల ముఖ్యయోధుల పేర్లను ద్రోణాచార్యున కెఱింగించుచున్నాడు -
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః ||
ధృష్టకేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ
శైబ్యశ్చ నరపుంగవః ||
యుధామన్యుశ్చ విక్రాన్త
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః ||
తా:- ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులు పెక్కురుకలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కున్తిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు ఉపపాండవులు. వీరందఱును మహారథులే అయి యున్నారు.
వ్యాఖ్య:- పైన దెల్పిన వీరులందఱు భీమార్జునులతో సమానులని చెప్పుటవలన వారిరువురును శూరాగ్రేసరులనియు, దుర్యోధనునకు భయోత్పాతము కలిగించువారనియు స్పష్టపడుచున్నది. దుర్యోధనుడు స్వపక్షవీరులను గూర్చి ముందుగా దెలుపక పరపక్షనాయకులను వర్ణించి చెప్పుటలో రెండు కారణములు కలవు - (1) ఆచార్యునకు శత్రుసైన్యముపై రోషము కల్పించుట (2) తన సైన్యము విషయమై ధైర్యము తగ్గియుండుట, లేక, తన సైన్యముకంటె ప్రతిపక్ష సైన్యమే బలవత్తరముగ నున్నదను భావము గలిగియుండుట.
“మహారథుడు" - పదివేల ధనుర్ధరులగు యోధులతో ఏకాకిగ యుద్ధము చేయగలవాడును, ఆయుధశాస్త్రమందు ప్రవీణుడునగు శూరుడు మహారథు డనబడును*.
యుయుధానుడు - ఇతనికి సాత్యకి యనియు పేరుగలదు.
ధృష్టకేతువు - చేదిదేశపురాజు, శిశుపాలుని పుత్రుడు.
పురుజిత్, కున్తిభోజులు - కుంతీదేవికి సోదరులు.
ద్రౌపదేయులు - ద్రౌపదిసుతులగు ఉపపాండవులు, ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు - వీరైదుగురున్ను క్రమముగ ధర్మరాజ భీమాదులకు ద్రౌపదివలన గలిగిన సంతానము.
-------------------------
*ఏకోదశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినామ్
శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః
0 comments:
Post a Comment