Games

 

18 Dec 2017

జనవరి - వేదాంతభేరి - 2018

0 comments

                              జనవరి - వేదాంతభేరి - 2018








Read more...

19 Nov 2017

గీతామకరందము-01-10

3 comments
01-10-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ||  ఇవ్విధముగ తన పక్షమునగల శూరులను పొగడి తదుపరి దుర్యోధనుడు రెండువైపుల గల సేనలను లెక్కగట్టి తన సైన్యమే చాల గొప్పదని నుడువుచున్నాడు –

అపర్యాప్తం తదస్మాకం 
బలం భీష్మాభిరక్షితమ్
పర్యాప్తం త్విదమేతేషాం 
బలం భీమాభిరక్షితమ్.

తా:- అట్టిశూరులుకల మనసైన్యము భీష్మునిచే గాపాడ బడుచు అపరిమితముగ నున్నది. (అజేయమై యొప్పుచున్నది). పాండవులయొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగనున్నది. (జయింప శక్యమైయున్నది.)

వ్యాఖ్య:- ఈ శ్లోకములోని 'అపర్యాప్తం', 'పర్యాప్తం' అను పదముల యర్థమందు భాష్యకారులలో మతభేదము కన్పట్టు చున్నది. ఆనందగిరి, శంకరానందులు మున్నగువారు 'అపర్యాప్త’ పదమునకు అపరిమితమను అర్థమును సూచించిరి. శ్రీధరులు మున్నగువారు అసంపూర్ణము, అసమర్థము అను భావమును ప్రకటించిరి. కాని యిందు మొదటియర్థమే సమీచీనముగ తోచుచున్నది. ఏలననగా దుర్యోధను డిదివఱలో ఉద్యోగపర్వమందు ధృతరాష్ట్రునితోను (ఉ.54–60-70), భీష్మపర్వమున ద్రోణాచార్యునితోను (భీష్మ 51-4-6) తన సైన్యముయొక్క గొప్పతనమును గూర్చి మిక్కుటముగ శ్లాఘించి యుండెను. వారలను ఉత్సాహపరుచు నిమిత్త మావిధముగ నతడు చెప్పి యుండెను. ఇపుడును అదియే సందర్భము కనుక, మఱియొక విధముగ నాతడు చెప్పియుండడు. తన సైన్యమును కించపఱచుకొను అవకాశ మిచట లేదు. శ్లోకము యొక్క ధోరణి స్వపక్షమును కీర్తించునదిగనే యున్నది. కావున "మన సైన్యము చాలకున్నది. పాండవ సైన్యము పరిపూర్ణముగనున్నది' అను నర్థ మిచట సందర్భోచితముగా లేదు. తన సైన్యమును శ్లాఘించుచు భీష్మపర్వమున (51-6) ఇదియే శ్లోకమును దుర్యోధనుడు ద్రోణాచార్యునకు చెప్పినవిషయమున్ను ఇచట గమనించ దగియున్నది.

" భీమాభిరక్షితమ్' - కౌరవసేనకు భీష్ముడధిపతియై యున్నట్లు, పాండవసేనకు ధృష్టద్యుమ్ను డధిపతియై యుండ, ఇట " భీమునిచే రక్షింపబడిన పాండవసేన" అని యేల చెప్పబడినది? ఇందులకు కారణము లివియైయుండ వచ్చును - 
(1)భీముడు ధార్తరాష్ట్రులనందఱిని వధించుటకు కృతనిశ్చయుడై యున్నందున దుర్యోధనుని చిత్తమున అతడే స్ఫురించియుండవచ్చును. 
(2)ధృష్టద్యుమ్నుడు పాండవసేనకు నాయకుడుగ నియమింపబడినను, సేననంతను కాపాడుచుండుటకు భీముడుకూడ నియోగింపబడెను. 
(3)మొదటి దినమున పాండవులచే రచింపబడిన వజ్రవ్యూహముయొక్క రక్షణ కొఱకు దాని యగ్రభాగమునందు భీముడుండెను. కావున సేనారక్షకుడుగ నాతడే దుర్యోధనునకు గన్పట్టియుండవచ్చును.
Read more...

గీతామకరందము-01-07,08,09

1 comments
01-07,08,09-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అస్మాకం తు విశిష్టా  యే 
తాన్నిబోధ ద్విజోత్తమ
నాయకా మమ సైన్యస్య 
సంజ్ఞార్థం  తాన్ బ్రవీమి తే|| 

తా:- ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరుకలరో వారలను జ్ఞాపకముకొఱకు మీకు చెప్పుచున్నాను. (వినుడు).

వ్యాఖ్య:- ప్రతిపక్షవీరులను మాత్రము తెలిపినచో ద్రోణున కొకవేళ అధైర్యము కలుగునేమోయని తలంచి ధైర్యోత్పాదనము కొఱకు స్వకీయ శూరవీరులను గూడ దుర్యోధనుడు తెలుప నారంభించుచున్నాడు. 
08
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ 
కృపశ్చ సమితింజయః | 
అశ్వత్థామా వికర్ణశ్చ 
సౌమదత్తి స్తథైవ  చ * || 
09
అన్యే చ బహవశ్శూరా 
మదర్థే త్యక్తజీవితాః | 
నానాశస్త్ర ప్రహరణాః 
సర్వే యుద్ధవిశారదాః || 

తా:- మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొఱకు తమతమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందఱును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్రసంపన్నులై ఇచట నున్నారు.

వ్యాఖ్య:- దుర్యోధనుడు వీరులను పేర్కొనునపుడు తన పక్షమునకు భీష్ముడు సేనాపతి
యైయుండ, ఆతని పేరు ముందు చెప్పక ద్రోణునిపేరు ఏల చెప్పవలసివచ్చెను? ఎదుటనున్న ద్రోణు డేమి భావించుకొనునోయని సందేహించికాని, గురువును ప్రప్రథమమున ఎన్నుకొనుట భావ్యమని తలంచికాని, ద్రోణాచార్యుని ఉత్తేజపఱచు నుద్దేశ్యముతోగాని అట్లు చేసియుండవచ్చును.
రెండు సేనలయందలి శూరవీరులను ద్రోణాచార్యుడెఱిగియున్నను, అతనితో జెప్పునెపమున దుర్యోధనుడు వారలను తిరిగి జ్ఞాపకము చేసికొని బలాబలములను లెక్కించుచున్నాడు. 

'త్యక్తజీవితాః' = (ప్రాణములను విడిచిపెట్టినవారు) — అను పదము దుర్యోధనుని ముఖతః వెలువడుటబట్టిచూడ తన వారందఱున్ను నశించియే పోవుదురని ముందుగనే అతని అంతరాత్మ భావించియుండవచ్చునని తోచుచున్నది. ఆ ప్రకారముగ పలుకుట దుర్యోధనునకు దుర్నిమిత్తసూచకమని కొందఱి మతము.
------------------------------------------
*సౌమదత్తిర్జయద్రథః - (పాఠాన్తరము)

Read more...

18 Nov 2017

గీతామకరందము-01-04,05,06

0 comments
01-04,05,06-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ|| దుర్యోధనుడు పాండవపక్షమునగల ముఖ్యయోధుల పేర్లను ద్రోణాచార్యున కెఱింగించుచున్నాడు -

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | 
యుయుధానో విరాటశ్చ 
ద్రుపదశ్చ మహారథః || 

ధృష్టకేతు శ్చేకితానః 
కాశీరాజశ్చ వీర్యవాన్ | 
పురుజిత్కున్తిభోజశ్చ
శైబ్యశ్చ నరపుంగవః || 

యుధామన్యుశ్చ విక్రాన్త 
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | 
సౌభద్రో ద్రౌపదేయాశ్చ 
సర్వ ఏవ మహారథాః || 

తా:-   ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులు పెక్కురుకలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కున్తిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు ఉపపాండవులు. వీరందఱును మహారథులే అయి యున్నారు.     

వ్యాఖ్య:- పైన దెల్పిన వీరులందఱు భీమార్జునులతో సమానులని చెప్పుటవలన వారిరువురును శూరాగ్రేసరులనియు, దుర్యోధనునకు భయోత్పాతము కలిగించువారనియు స్పష్టపడుచున్నది. దుర్యోధనుడు స్వపక్షవీరులను గూర్చి ముందుగా దెలుపక పరపక్షనాయకులను వర్ణించి చెప్పుటలో రెండు కారణములు కలవు - (1) ఆచార్యునకు శత్రుసైన్యముపై రోషము కల్పించుట (2) తన సైన్యము విషయమై ధైర్యము తగ్గియుండుట, లేక, తన సైన్యముకంటె ప్రతిపక్ష సైన్యమే బలవత్తరముగ నున్నదను భావము గలిగియుండుట.

“మహారథుడు" - పదివేల ధనుర్ధరులగు యోధులతో ఏకాకిగ యుద్ధము చేయగలవాడును, ఆయుధశాస్త్రమందు ప్రవీణుడునగు శూరుడు మహారథు డనబడును*.
యుయుధానుడు - ఇతనికి సాత్యకి యనియు పేరుగలదు. 
ధృష్టకేతువు - చేదిదేశపురాజు, శిశుపాలుని పుత్రుడు. 
పురుజిత్, కున్తిభోజులు - కుంతీదేవికి సోదరులు.
ద్రౌపదేయులు - ద్రౌపదిసుతులగు ఉపపాండవులు, ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు - వీరైదుగురున్ను క్రమముగ ధర్మరాజ భీమాదులకు ద్రౌపదివలన గలిగిన సంతానము.
-------------------------
*ఏకోదశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినామ్ 
శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః
Read more...

16 Nov 2017

గీతామకరందము-01-03

0 comments
01-03-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ||  దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఈ ప్రకారముగ పలుకుచున్నాడు –

పశ్యైతాం పాణ్డుపుత్రాణాః 
ఆచార్య మహతీం చమూమ్ | 
వ్యూఢాం ద్రుపదపుత్రేణ 
తవ శిష్యేణ ధీమతా || 

తా:- ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీశిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత వ్యూహాకారముగ రచింపబడియున్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును జూడుడు!

వ్యాఖ్య:- ఈ శ్లోకమునకు ముందు 'దుర్యోధన ఉవాచ' అని యుండవలసినది. కాని అట్లులేదు.
పాపియగుటచే ఆతని నామమును పుణ్యశీలురగు గీతాపాఠకులచే పలుమారు ఉచ్చరింపకుండ జేయుటకే కాబోలు ఆ విధముగ గావింపబడినది!
   దుర్యోధనుడు రాజకీయ చతురత గలవాడు. కార్యసాధన నిమిత్తము రాజగు తానే దిగివచ్చి ఒకానొక సేనానాయకునితో (ద్రోణాచార్యునితో) మాట్లాడుటయేకాక, ప్రతిపక్షముపై నాతనికి రోషమునుగూడ కల్పింపజొచ్చెను. ‘ద్రుపదుని  పుత్రుడును, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నుడు పాండవసేనలను చక్కగా తీర్చిదిద్దెను - ’ అని పలుకుట ద్వారా యతడు ద్రోణాచార్యునకు ద్రుపదుని యెడలగల పూర్వపు వైరమును జ్ఞప్తికి దెచ్చెను. మఱియు ‘మీకు శిష్యుడుగానున్నవాడే ప్రతిపక్షమునకు నాయకుడై గురువగు మీ పైననే కత్తిగట్టుచున్నాడ’ని తెలిపి ద్రోణాచార్యునకు తీవ్రమగు రోషమును జనింపజేయు చున్నాడు. ఎదిరి పక్షమును, తన్నాయకుని గొప్పగా వర్ణించుటద్వారా స్వపక్షనాయకునకు వారిపై ప్రతీకారభావనను వృద్ధినొందించుటయే దుర్యోధనుని యాశయము. 
   ‘ధీమంతు’డని పేర్కొనబడుటచే ధృష్టద్యుమ్నుడు వ్యూహరచనలో గొప్పనేర్పరి యని తేలుచున్నది. కనుకనే యాతనిని పాండవులు తమ సేనానాయకునిగ నెన్నుకొనియుండిరి.
Read more...

గీతామకరందము 01-02

0 comments
01-02-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ||  ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానముగా సంజయు డిట్లు  వచించుచున్నాడు -

సంజయ ఉవాచ :-
దృష్ట్వాతు పాణ్డవానీకం 
వ్యూఢం దుర్యోధనస్తదా |  
ఆచార్యముపసంగమ్య 
రాజా వచనమబ్రవీత్ || 

తా:- ధృతరాష్ట్రునితో సంజయు డిట్లు వచించెను - అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగ రచింపబడి యున్న పాండవసేనను జూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు  పలికెను.
వ్యాఖ్య:- పాండవసేనాపతియగు ధృష్టద్యుమ్నుడు యుద్ధశాస్త్రానుసారముగ తన సైన్యమును వజ్రమను పేరుగల వ్యూహముగ నమర్చియుంచెను. పాండవసేనయొక్క అద్భుత వ్యూహరచన దుర్యోధనున కాశ్చర్యముగొలుప, అంతకంటెను పటుతరముగ తన సైన్యమును నిర్మింపజేయ నుద్దేశ్యముతో కాబోలు వెనువెంటనే ఆ వార్తను గురువగు ద్రోణాచార్యున కెఱింగించెను.
దుర్యోధనుడు రాజు. ప్రభుత్వమున సర్వోన్నతస్థానము నలంకరించినవాడు. అట్టిచో తనకంటె క్రింది స్థానముననున్న ఒకొనొక సేనానాయకుని యొద్దకు తానే స్వయముగ బోవలసిన పనియేమి యను శంక నిచట నుదయించును. ఇందులకు కారణము లివియై యుండవచ్చును - 
(1) పాండవుల సైన్యమును, అందును ముఖ్యముగ భీమాదులను జూచి భయపడి దుర్యోధనుడు అధైర్యమును బొంది యుండవచ్చును. (ప్రారంభములోనే రాజు ధైర్యమును గోల్పోవుట అశుభసూచకము). 
(2)ద్రోణాచార్యుడు సేనానాయకులలో నొకడు కావున ఆతనిని ఆ స్థానమునుండి కదలించినచో సైన్యమంతయు చెదరిపోవు నవకాశము కలదు. 
(3)ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు. పైగా గురుస్థానముననున్నవాడు. అట్టివానియెడల విధేయత చూపుట ధర్మము. 
(4) ఏదియో విధముగ ద్రోణాచార్యుని మంచిచేసికొని ఆతనిని తన స్వార్థసంపాదనమునకు వినియోగించదలంచి యుండవచ్చును - ఈ యన్ని కారణముల బట్టి దుర్యోధనుడు ఆచార్యుని తన యొద్దకు పిలిపించక తానే ఆచార్యునికడకేగి విన్నవించుకొనెను.
Read more...

15 Nov 2017

గీతామకరందము 01-01

0 comments
01-01-గీతా మకరందము
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి

శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 
శ్రీ సద్గురు పరమాత్మనే నమః - సర్వమహర్షిభ్యోనమః 
గీతా మకరంద వ్యాఖ్యాసహిత 
 శ్రీ భగవద్గీత 

అథ ప్రథమోఽధ్యాయః 
ఒకటవ అధ్యాయము 
అర్జునవిషాదయోగః

అర్జున విషాద  యోగము 

అవతారిక ||  యుద్ధమునుగూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించుచున్నాడు – 

ధృతరాష్ట్ర ఉవాచ :-
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ || 

తాత్పర్యము:- ధృతరాష్ట్రుడిట్లు పలికెను:- ఓ సంజయా! నావారలగు దుర్యోధనాదులును, పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధముచేయ కుతూహలముతో పుణ్య భూమియగు కురుక్షేత్రమున జేరి యేమి చేసిరి?

వ్యాఖ్య:- “ధర్మ” శబ్దముతో గీత ప్రారంభమైనది. అది మంగళవాచకము. ధర్మమను పదమును మొట్టమొదట ప్రయోగించుటద్వారా శ్రీ వ్యాసమహర్షి గీతకు మంగళాచరణమును గావించినవాడాయెను. ఏలయనిన, భగవానుడు ధర్మస్వరూపుడు. ధర్మశబ్దోచ్చారణముచే భగవన్నామమునే వ్యాసులు కీర్తించినట్లైనది. గీతాగ్రంథము యొక్క లక్ష్యము, సారాంశము ఈ మొదటి పదమునందే తేల్చివేయబడెను. అదియే "ధర్మము”. అట్టి ధర్మోద్దరణము కొఱకే లోకమున భగవంతు డవతరించుచుండును*. 

 ధృతరాష్ట్రుడనగా రాష్ట్రమును ధరించినవాడని యర్థము. తనదికాని రాష్ట్రమును తనదని భావించువాడే ధృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి  మున్నగునవి దృశ్యములు, అవి తాను గాదు. దృక్కగు ఆత్మయొకటియే తానుగాని, దేహాది దృశ్యపదార్థములు కాదు. కాని అజ్ఞాని తనదికానట్టి అనగా ఆత్మేతరమైనట్టి దేహాది దృశ్యరూపరాష్ట్రమును తనదిగా దలంచి దానిపై మమత్వము, అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే ఆతడు ధృతరాష్ట్రుడు. అజ్ఞానభావముతో గూడియుండు వారందఱున్ను ధృతరాష్ట్రులే యగుదురు. గీతాజ్ఞానశ్రవణముచే అట్టి అజ్ఞానరూప అంధత్వమును రూపుమాపుకొనుట ప్రతివానియొక్క కర్తవ్యమైయున్నది.

'కురుక్షేత్రము':- ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము. పంజాబ్ రాష్ట్రమున అంబాలా అను పట్టణమునకు దక్షిణముగను, ఢిల్లీ పట్టణమునకు ఉత్తరముగను ఇది వెలయుచున్నది. మహాభారత మందలి వనపర్వమున 83వ అధ్యాయమునందును, శల్యపర్వమున 53వ అధ్యాయమునందును ఈ కురుక్షేత్రము యొక్క మహిమను గుఱించి లెస్సగ తెలుపబడియున్నది. పూర్వము బ్రహ్మదేవుడు, ఇంద్రుడు అగ్ని  మున్నగు వారచ్చోట తపంబు సలిపియుండిరి. కౌరవులకు పాండవులకు మూలపురుషుడైన కురుమహారాజున్ను ఆ  స్థలమున పెక్కు ధర్మము లాచరించి యుండెను. ఒకానొక సమయమున కురుభూపాలుడు ఆ ప్రదేశమును దున్నుటచే దానికి కురుక్షేత్రమని పేరువచ్చినది. ఆ క్షేత్రమునందెవరు  తపస్సు చేయుదురో, లేక మృతినొందుదురో వారు ఉత్తమలోకములకు జనుదురని ఇంద్రుడు కురునకు వరమిచ్చెను. పూర్వము పరశురాముడున్ను అచ్చోటనే పితృతర్పణము గావించి యుండెను. ఎందఱో మహనీయులా స్థలమున పెక్కు ధర్మకార్యము లాచరించి యుండిరి. కాబట్టి అయ్యిది. ధర్మక్షేత్రమని పేర్కొనబడెను.
   అట్టి ధర్మక్షేత్రమున ప్రవేశించుటవలన తత్ప్రభావముచే తన తనయులగు దుర్యోధనాదుల చిత్తమున దయాది సద్గుణములు ఉదయించిగాని, ధర్మరాజాదుల యందలి సహజ అహింసాది సద్గుణములు పెల్లుబికిగాని యుద్ధవిరమణమును గూర్చిన సంకల్పము లేవైన వారియందు ఉదయించియుండునేమోయను శంకచే ధృతరాష్ట్రుడు "యుద్ధమున వారేమిచేసిరి?' అని ప్రశ్నించి యుండవచ్చును.

'మామకాః' - 'నావారు' అని కౌరవులనుగూర్చి ప్రత్యేకించి చెప్పుటవలన ఆత్మీయులే యగు పాండవులయెడల ధృతరాష్ట్రునకొకింత పక్షపాతబుద్ధి కలదని వ్యక్తమగుచున్నది.

"సంజయుడు” - 'సమ్యక్ జయము' కలవాడే సంజయుడు. ఇంద్రియాదులను లెస్సగ నిగ్రహించినవాడని యర్థము. అట్టి ఇంద్రియజయము, పవిత్రహృదయము కలవారికే గీతా జ్ఞానము వినుటకు, ఆచరించుటకు, బోధించుటకు చక్కని యవకాశ మేర్పడగలదని సంజయుని వృత్తాంతము చాటుచు న్నది. మఱియు అల్పజాతియందు జనించినప్పటికిని (సూతకులస్థుడైనను), స్వకీయయోగ్యతచే, హృదయపారిశుద్ధ్యముచే వ్యాసాది మహర్షుల యొక్క అనుగ్రహమునకు పాత్రుడగుటయు, ప్రత్యక్ష గీతాశ్రవణ విశ్వరూపసందర్శనాది మహాభాగ్యముల నొంద గల్గుటయు చూడ, ఆత్మోన్నతికి జాతి, మత, కులాదులేవియు అడ్డంకులుకావని స్పష్టపడుచున్నది.
దుర్యోధనుని జయమును గుఱించి తెలిసికొనగోరి ధృతరాష్ట్రుడడిగిన 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే ...... కిమకుర్వత సంజయ' అను గీతయొక్క ప్రథమశ్లోకరూప ప్రశ్నకు సంజయుడు "యత్ర యోగేశ్వరః కృష్ణో .......... ధ్రువా నీతిర్మతిర్మమ' (గీత 18-78) ఎచట శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉందురో అచట విజయము తథ్యము అను గీతయొక్క చివరి శ్లోకమును ప్రత్యుత్తరముగ జెప్పదలంచినవాడై తద్భావమును పోషించుట కొఱకు అవాంతర వృత్తాంతమును (దృష్ణ్వాతు పాణ్డవానీకం...' మున్నగు శ్లోకములద్వారా) నుడువ నారంభించెను.
-----------------------------------
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే (4-8).
-----------
Read more...
1 comments
గీతా మాహాత్మ్యము

భగవన్‌ పరమేశాన
భక్తి రవ్యభిచారిణీ,
ప్రారబ్ధం భుజ్యమానస్య
కథం భవతి హే ప్రభో!

భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

ప్రారబ్ధం భుజ్యమానో౽పి
గీతాభ్యాసరత స్సదా
స ముక్తస్స సుఖీ లోకే
కర్మణా నోపలిప్యతే.

శ్రీ విష్ణువు చెప్పెను - ఓ భూదేవీ! ప్రారబ్ధ మనుభవించుచున్నను, ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును.

మహాపాపాది పాపాని
గీతాధ్యానం కరోతిచేత్‌,
క్వచిత్స్పర్శం న కుర్వంతి
నలినీదల మంభసా.

తామరాకును నీరంటనట్లు గీతాధ్యానముచేయు వానిని మహాపాపములుకూడ కొంచెమైనను అంటకుండును.

గీతాయాః పుస్తకం యత్ర
యత్ర పాఠః ప్రవర్తతే,
తత్ర సర్వాణి తీర్థాని
ప్రయాగాదీని తత్రవై.

ఎచట గీతాగ్రంథము యుండునో, మరియు ఎచట గీత పారాయణ మొనర్చబడుచుండునో, అచట ప్రయాగ మొదలగు సమస్తతీర్థములున్ను ఉండును.

సర్వే దేవాశ్చ ఋషయో
యోగినః పన్నగాశ్చయే,
గోపాలా గోపికావా౽పి
నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం
యత్ర గీతా ప్రవర్తతే.

ఎచట గీతాపారాయణము జరుగుచుండునో, అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శవర్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయమొనర్తురు.

యత్ర గీతావిచారశ్చ
పఠనం పాఠనం శ్రుతమ్‌,
తత్రాహం నిశ్చితం పృథ్వి
నివసామి సదైవ హి.

ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండునో, అచట నేనెల్లప్పుడును తప్పక నివసించుదును.


గీతాశ్రయో౽హం తిష్ఠామి
గీతా మే చోత్తమం గృహమ్‌,
గీతా జ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్లోకాన్పాలయామ్యహం

నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతాజ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.

గీతా మే పరమా విద్యా
బ్రహ్మరూపా న సంశయః,
అర్ధమాత్రాక్షరా నిత్యా
స్వనిర్వాచ్య పదాత్మికా.

గీత నాయొక్క పరమవిద్య. అది బ్రహ్మస్వరూపము. ఇట సంశయ మేమియును లేదు. మరియు నయ్యది (ప్రణవముయొక్క నాల్గవ పాదమగు) అర్ధమాత్రాస్వరూపము. అది నాశరహితమైనది. నిత్యమైనది. అనిర్వచనీయమైనది.

చిదానందేన కృష్ణేన
ప్రోక్తా స్వముఖతో౽ర్జునమ్‌,
వేదత్రయీ పరానందా
తత్త్వార్థజ్ఞానమంజసా

సచ్చిదానందస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మచే ఈ గీత స్వయముగ అర్జునునకు చెప్పబడినది. ఇది మూడు వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్మాశ్రయించినవారికిది శీఘ్రముగ తత్త్వజ్ఞానమును కలుగజేయును.

యో౽ష్టాదశ జపేన్నిత్యం
నరో నిశ్చలమానసః,
జ్ఞానసిద్ధిం స లభతే
తతో యాతి పరం పదమ్‌.

ఏ నరుడు నిశ్చలచిత్తుడై గీత పదునెనిమిది అధ్యాయములను నిత్యము పారాయణము సలుపుచుండునో, అతడు జ్ఞానసిద్ధినిబొంది తద్ద్వారా పరమాత్మపదమును (మోక్షమును) బడయగల్గును.

పాఠే౽సమర్థస్సంపూర్ణే
తదర్ధం పాఠ మాచరేత్‌,
తదా గోదానజం పుణ్యం
లభతే నాత్ర సంశయః

గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు.

త్రిభాగం పఠమానస్తు
గంగాస్నానఫలం లభేత్‌,
షడంశం జపమానస్తు
సోమయాగఫలం లభేత్‌.

గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) పఠించువారికి సోమయాగఫలము లభించును .

ఏకాధ్యాయం తు యో నిత్యం
పఠతే భక్తి సంయుతః,
రుద్రలోక మవాప్నోతి
గణోభూత్వా వసేచ్చిరమ్‌

ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో, అతడు రుద్ర లోకమునుపొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును.

అధ్యాయ శ్లోకపాదం వా
నిత్యం యః పఠతే నరః,
స యాతి నరతాం యావ
న్మనుకాలం వసుంధరే.

ఓ భూదేవీ! ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో, అతడు ఒక మన్వంతర కాలము (ఉత్కృష్టమగు) మానవ జన్మను బొందును.

గీతాయాః శ్లోక దశకం
సప్త పంచ చతుష్టయమ్‌,
ద్వౌత్రీనేకం తదర్ధం వా
శ్లోకానాం యః పఠేన్నరః.

చంద్రలోక మవాప్నోతి
వర్షాణా మయుతం ధ్రువమ్‌,
గీతాపాఠసమాయుక్తో
మృతో మానుషతాం వ్రజేత్‌.

గీతయందలి పది శ్లోకములుకాని, లేక ఏడుకాని, ఐదుకాని, నాలుగుకాని, మూడుకాని, రెండుకాని, ఒకటికాని లేక కనీసము అర్ధశ్లోకమును గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమునుబొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో, అతడు ఉత్తమమగు మానవజన్మమును బడయగల్గును.

గీతాభ్యాసం పునఃకృత్వా
లభతే ముక్తి ముత్తమామ్‌,
గీతేత్యుచ్చారసంయుక్తో
మ్రియమాణో గతిం లభేత్‌.

అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. 'గీతా - గీతా' అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును.

గీతార్థ శ్రవణాసక్తో
మహాపాపయుతోపి వా,
వైకుంఠం సమవాప్నోతి
విష్ణునా సహ మోదతే.

మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో సహా ఆనంద మనుభవించుచుండును.

గీతార్థం ధ్యాయతే నిత్యం
కృత్వా కర్మాణి భూరిశః,
జీవన్ముక్తస్స విజ్ఞేయో
దేహాంతే పరమం పదమ్‌.

ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను.

గీతామాశ్రిత్య బహవో
భూభుజో జనకాదయః,
నిర్ధూతకల్మషా లోకే
గీతాయాతాః పరమం పదమ్‌.

ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి.

గీతాయాః పఠనం కృత్వా
మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథా పాఠో భవేత్తస్య
శ్రమ ఏవ హ్యుదాహృతః ||

గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యమును నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫలమునివ్వక) వ్యర్థమేయగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమ మాత్రమే యని చెప్పబడినది.(గ్రంథము యొక్క మహిమను తెలుసుకొనినచో, గ్రంథము యెడల శ్రద్ధ కలుగదని భావము.)

ఏతన్మాహాత్మ్యసంయుక్తం
గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫల మవాప్నోతి
దుర్లభాం గతి మాప్నుయాత్ ||

ఈ మాహాత్మ్యముతోబాటు గీతాపారాయణముచేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు.

సూత ఉవాచ:-
మాహాత్మ్యమేతద్గీతాయా
మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాన్తే చ పఠేద్యస్తు
యదుక్తం తత్ఫలం లభేత్ ||

సూతుడు చెప్పెను - ఓ శౌనకాది మహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును, నేను మీకు దెలిపితిని. అద్దానిని గీతాపారాయణానంతర మెవడు పఠించునో అతడు పైన దెలిపిన ఫలమును బొందును.

ఇతి శ్రీ వరాహపురాణే
శ్రీ గీతామహాత్మ్యం సంపూర్ణమ్ .

ఇట్లు శ్రీ వరాహ పురాణమందలి
శ్రీ గీతామహాత్మ్యము సమాప్తము.
ఓమ్
Read more...

14 Nov 2017

గీతామకరందము 18-78

0 comments
గీతామకరందము18-78
18-78-గీతా మకరందము.
        మోక్షసన్న్యాసయోగము
   
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అll శ్రీకృష్ణారునులుండుచోట విజయము, ఐశ్వర్యము మున్నగు శుభలక్షణములు వెలయుచుండునని సంజయుడు పలుకుచున్నాడు –

యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః
ధృవా నీతిర్మతిర్మమ ||

తా:- ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను , ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను ఐశ్వర్యమున్ను, దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము.

వ్యాఖ్య:- గీతా గ్రంథ మీశ్లోకముతో సుసంపన్నమగుచున్నది. భగవత్సాన్నిధ్యమందు, భక్తుని సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణమేర్పడునో ఈ శ్లోకముద్వారా వెల్వడిచేయబడినది. ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణభగవానుడుండునో, మఱియు నెచట ధనుర్ధారియగు అర్జునుడుండునో అచట ఐశ్వర్యము, విజయము, మున్నగునవి వెలయుచుండునని చెప్పబడినది. కాబట్టి విజయమును, నీతిని, జ్ఞానసంపదను అభిలషించువారు భగవచ్చింతనాదులద్వారా సాక్షాత్ భగవానుని తమ హృదయమందు ప్రతిష్టింపజేసికొనవలెను.
భగవంతుడగు శ్రీకృష్ణుడుండుచోటే కాక, భక్తుడగు అర్జునుడుండుచోట గూడ అట్టి విజయాదులు సంభవించునని యేల చెప్పబడెననగా, అర్జునుడు సామాన్యభక్తుడు కాడు. ధనుర్ధారియగు భక్తుడు. అనగా బాహ్యశత్రువుల నే ప్రకారము గాండీవముచే జయించివైచెనో, అట్లే అంతఃశత్రువులనుగూడ గీతాజ్ఞానరూపధనుస్సుచే ఛేదించివైచి మోహరహితుడై విలసిల్లెను
 (నష్టో మోహః). ఈ ప్రకారముగ అజ్ఞానము నశించిన భక్తుడు సాక్షాత్ భగవంతుడే యగుచున్నాడు. (బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి) కావున ప్రకృతిని జయించినట్టియు, మాయాశత్రువును జ్ఞానఖడ్గముచే, జ్ఞానధనుస్సుచే విచ్ఛిన్న మొనర్చినట్టియు భక్తుడుండుచోటగూడ భగవత్సాన్నిధ్యమందువలె విజయ సంపదాదులు వర్ధిల్లుచుండుటలో ఆశ్చర్యమేమియును లేదు. అయితే ఇచట తెలిపినది సామాన్యభక్తుని విషయముకాదనియు, అజ్ఞానమును, కామక్రోధాదులను జయించి ప్రకృతిపై విజయమును సాధించిన (ధనుర్ధరుడగు) భక్తునివిషయమే చెప్పబడినదనియు నెఱుగవలెను. కాబట్టి గీతాజ్ఞానరూప మహాధనుస్సును జేబట్టినవాడును, నిష్కామకర్మ, భక్తి జ్ఞాన ధ్యాన  వైరాగ్యాదులు అను అస్త్రములను ధరించినవాడు నగు భక్తునిచెంత సాక్షాత్ భగవానుని సాన్నిధ్యమందువలె విజయాదులు వర్ధిల్లుచుండునని భావము. అట్టి పరమభక్తులు, జ్ఞానులు  సాక్షాత్ భగవత్స్వరూపులుగనే యుందురు. కావున దైవమందెట్టి పవిత్రీకరణశక్తి యుండునో వారియందున్ను అట్టి శక్తి యుండును. ఏలయనిన, అతిశయభక్తిస్థితియందు, లేక జ్ఞానస్థితియందు, భక్తునకును భగవంతునకును, లేక జ్ఞానికిని దేవునకును భేదము యుండదు. (జ్ఞానీత్వాత్మైవ మే మతమ్).

మఱియు "ధనుర్ధరః” అనుపదము కర్మయోగమును, నిర్మల అనుష్ఠానమును గూడ సూచించుచున్నది. ప్రతివ్యక్తికిని తత్త్వబోధతో బాటు అనుష్ఠానముగూడ ఉండవలెనని ఆ పదముచే స్పష్టమగుచున్నది.
ఎచట శ్రీకృష్ణుడుండునో అచట విజయ, ఐశ్వర్యము లుండునని తెలుపుటవలన ప్రతివారును తమ గృహమందును, తమ హృదయమందును భగవంతుని స్థాపించుకొని నిరంతరము అర్చన పూజాధ్యానాదులు సలుపుచుండినచో అచ్చోట సాక్షాత్ పరమాత్మయే నివసించుచుండును. గావున అట విజయైశ్వర్యాదులు తప్పక నుండగలవు. అట్లే ఎచట భక్తి జ్ఞాన వైరాగ్యాదులు, దైవీసంపత్తి గలిగియున్న మహనీయులు, భక్తవర్యులు నివసించుచుందురో అచ్చోట ధనుర్ధారియగు అర్జునుని సన్నిధానమందువలె విజయాదులు వర్థిల్లునని గ్రహింపవలెను. లోకమునందును ఇపుడు భగవత్పూజాదులు జరుగుచోట, మహనీయులుండు చోట శుభప్రదమైన వాతావరణము, విజయాది సల్లక్షణములు ఉండియుండుట మనము చూచుచునే యున్నాము.
ప్రతిజీవియు విజయమునే కోరునుగాని అపజయమును గాదు. సంపదనే కోరునుగాని దారిద్ర్యమునుగాదు. కాని అవి లభించుట కుపాయమేమి? ఆ యుపాయ మీ శ్లోకమున చెప్పబడినది. దానిని కార్యాన్విత మొనర్చుకొనినచో తప్పక ఆ విజయాదులు జనులకు లభించగలవు. శ్రీకృష్ణపరమాత్మను వారి హృదయమందు, వారి గేహమందు చేర్చుటయే ఆ యుపాయము. భగవంతుని భక్తిపూర్వకముగ ధ్యానించుచు భగవత్సాన్నిధ్యము ననుభవించుచుండుటయే ఆ యుపాయము. ఎచట శ్రీకృష్ణుడుండునో అచట విజయాదులుండుట తథ్యము. కాబట్టి భగవత్సాన్నిధ్యమును గలుగజేసికొనుచుండు భగవద్భక్తులకు విజయాదులు తప్పక సిద్ధించితీరును. అట్లే మహనీయులగు జ్ఞానులు, యోగిపుంగవులు మున్నగువారి సాంగత్యమందును అట్టి మహ మహచ్ఛక్తి కలుగగలదు. కావున భగవత్సాన్నిధ్యము, సజ్జనసాంగత్యము రెండిటిని కలుగజేసికొనుచు శ్రీకృష్ణార్జునుల (నరనారాయణుల) యిరువురి సాంగత్యశ్రీని అనుభవించుచుండవలెను.
మఱియు ఎచ్చోట (ఏ పక్షమున) శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉండునో, ధర్మమేపక్షమున నుండునో అచట (ఆ పక్షమున) విజయము తప్పక కలుగునను వాక్యమును చెప్పుటద్వారా సంజయుడు పాండవ పక్షముననే విజయము కలుగునను భావమును ధృతరాష్ట్రునకు ధ్వనింపజేసెను. (ఆ వాక్యమును వినియైనను ధృతరాష్ట్రుడు  సంధిచేసికొని యుద్ధమును మాన్పించుట శ్రేయస్కరమని యాతనికి గూఢముగ బోధింపబడినది).
ఈ శ్లోకమందలి " ధ్రువానీతి” అను పదమునకు "నీతి మున్నగునవి తప్పక కలుగును' అని కొందఱు అర్థము చెప్పిరి.

గీతయొక్క అంతమున సంజయునిచే బోధింపబడిన ఈ "యత్రయోగేశ్వరః కృష్ణో" - అను మహత్తరమగు శ్లోకమును భక్తులు మఱల మఱల జ్ఞాపకము చేసికొనుచు భగవత్సాన్నిధ్యమును తమ హృదయమున నిరంతరము కలుగజేసికొనుచు భగవదనుగ్రహముచే జీవితములను ఆనందమయములుగ నొనర్చుకొందురుగాక!

మఱియు భగవానునిచే కరుణతో బోధింపబడిన ఈ గీతాశాస్త్రము నంతను చక్కగ పఠించి, అనుష్టించి, ఆత్మానుభూతిని బడసి జన్మరాహిత్యరూప నిత్యానందపదవి నొందుటద్వారా మానవ జీవితమును కృతార్థము చేసికొందురు గాక!

       హరిః ఓం తత్ సత్
శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం
శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే  శ్రీకృష్ణార్జునసంవాదే మోక్షసన్న్యాసయోగోనామ
అష్టాదశోఽధ్యాయః

ఇది శ్రీవ్యాసముని విరచితమైనదియు, నూఱువేల శ్లోకములు గలదియును, ఛందోబద్ధ మైనదియు నగు శ్రీమహాభారతమున భీష్మపర్వమునగల ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జునసంవాదమును నగు
శ్రీ భగవద్గీతలందు మోక్షసన్న్యాసయోగమను
పదునెనిమిదవ అధ్యాయము
సంపూర్ణము
హరిః ఓమ్ తత్ సత్
శ్రీ పరబ్రహ్మార్పణమస్తు ఓమ్
Read more...

20 Oct 2017

ఆశ్రమం లో దీపావళి పూజ

0 comments
                                              ఆశ్రమం లో దీపావళి పూజ






 
Read more...

1 Oct 2017

అక్టోబర్ - వేదాంతభేరి - 2017

0 comments
                                             అక్టోబర్ - వేదాంతభేరి - 2017





Read more...

7 Sept 2017

రామాయణ రత్నాకరం

0 comments

                                       రామాయణ రత్నాకరం 

                                                                             (పునర్ముద్రణ)




                                              పేజీలు-870(Hard bound)        వెల రు-300/-
                      వివరములకు 8106851901 whatsapp నంబరుకు Message పంపవచ్చును.

Read more...

23 Aug 2017

సెప్టెంబర్ - వేదాంత భేరి - 2017

1 comments
సెప్టెంబర్ - వేదాంత భేరి - 2017







Read more...

22 Jul 2017

ఆగష్టు వేదాంత భేరి - 2017

0 comments

ఆగష్టు వేదాంత భేరి - 2017





Read more...

24 Jun 2017

జూలై వేదాంత భేరి - 2017

1 comments
జూలై వేదాంత భేరి - 2017








Read more...

27 May 2017

జూన్ వేదాంతభేరి - 2017

1 comments
                                                         జూన్ వేదాంతభేరి 2017










Read more...

8 May 2017

జ్ఞాన సదస్సు

0 comments


Read more...

22 Apr 2017

2 comments
            మే వేదాంతభేరి 2017







Read more...

10 Apr 2017

0 comments
శ్రీ గురుదేవుల ఆరాధన చిత్రాలు
Gurudev's Aaraadhana pics

Read more...

24 Mar 2017

0 comments
April vedanta bheri 2017


Read more...

13 Mar 2017

0 comments
శ్రీ శుకబ్రహ్మ ఆశ్రమ వార్షికోత్సవము ఏప్రిల్ 10 -14


Read more...